నూతనకల్, మే 27 : ఆడబిడ్డల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆ దిశగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో 20 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. ఆడబిడ్డల తల్లిదండ్రుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని, ఇంటి పెద్దగా మారి రూ. లక్షా 116 ఇస్తున్నట్లు తెలిపారు. భ్రూణ హత్యలను నివారించేందుకు ప్రభుత్వ దవాఖానల్లో కాన్పు జరిగితే ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లవాడు పుడితే రూ. 12 వేలు, కేసీఆర్ కిట్ ఉచితంగా అందిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. త్వరలో కల్యాణలక్ష్మి చెక్కులను పెళ్లిలోనే అందించేలా చర్యలు తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు.
మద్దిరాల : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శుక్రవారం మద్దిరాల తాసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీలకే అనుకున్న పథకం నేడు కులాలతో సంబంధం లేకుండా తెల్ల రేషన్కార్డు ఉన్న ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి పథకంతో ఆడపిల్ల పెళ్లి చేసిన తల్లిదండ్రులకు కొంతమేర ఆర్థికభారం తగ్గుతుందని చెప్పారు.
సీఎం కేసీఆర్ తమ కుటుంబ పెద్ద దిక్కుగా మారారని లబ్ధిదారులు పేర్కొనడం హర్షణీయమన్నారు. కార్యక్రమాల్లో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ రజాక్, ఎంపీపీలు కళావతీసంజీవరెడ్డి, గుడ్ల ఉపేంద్ర, జడ్పీటీసీలు దామోదర్రెడ్డి, సురాంబ, తాసీల్దార్లు జమీరొద్దీన్, అమీన్సింగ్, ఎంపీడీఓలు ఇందిర, సరోజ, పీఏసీఎస్ చైర్మన్ వెంకన్న, వైస్ ఎంపీపీ శ్రీరాంరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మల్లయ్య, రవీందర్రావు, మధుసూదన్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.