నీలగిరి, డిసెంబర్ 29 : నల్లగొండ పట్టణ సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, కలెక్టర్ టి.వినయ్క్రిష్ణారెడ్డి సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు. గురువారం కలెక్టర్ చాంబర్లో ఇంజినీరింగ్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, విద్యుత్శాఖ, హైవేస్, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరు నెలల నుంచి పనులు మందకొండిగా జరుగుతున్నాయని, వాటిని వేగవంతం చేయాలన్నారు.
ఎమ్మెల్యే కంచర్ల మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి ప్రజలు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. రహదారుల విస్తరణ, జంక్షన్ల పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయన్నారు. ఇచ్చిన గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మర్రిగూడ జంక్షన్ నుంచి వివేకనంద విగ్రహం వరకు విద్యుత్ స్తంభాలను జనవరి 3లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. రహదారి విస్తరణ, పుట్పాత్లు, ఇంటర్లాకింగ్ టైల్స్ వేయుట, అప్రోచ్ రోడ్డు పనులు జనవరి 20లోగా పూర్తి చేయాలన్నారు. కేశరాజుపల్లి నుంచి కలెక్టరేట్ వరకు కలెక్టరేట్ నుంచి డీఈఓ కార్యాలయం వరకు పనులను ఏప్రిల్ లోగా, పాతబస్తీ రోడ్డును జనవరి 15లోగా, డీఈఓ కార్యాలయం నుంచి సాగర్ జంక్షన్ వరకు పనులను జనవరి చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు బజార్ను పదిరోజుల్లో, వైకుంఠధామాల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నా రు. ఉదయసముద్రం, కళాభారతి పనులు జనవరి చివరిలోగా పూర్తి చేయాలని సూచించారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేసి వార్డు ప్రజలు, కౌన్సిలర్లతో ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కమిషనర్ కేవీ.రమణాచారి, పబ్లిక్ హెల్త్ ఈఈ కందుకూరి వెంకటేశ్వర్లు, ఈఈ సత్యనారాయణ, ఆర్అండ్బీ ఈఈ నరేందర్, మున్సిపల్ డీఈలు పాల్గొన్నారు.