నల్లగొండ, నవంబర్ 11 : మరోసారి అవకాశం ఇవ్వండి..ఆశీర్వదించి అసెంబ్లీ పంపండి.. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. ఆపదొస్తే ఆదుకుంటా, నల్లగొండను మరింత అభివృద్ధి చేస్తానని నల్లగొండ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని 33, 47వ వార్డుల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 20 ఏండ్లుగా ఎలాంటి అభివృద్ధ్దికి నోచుకోకుండా ఉన్న నల్లగొండను బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో చేస్తున్న అభివృద్ధి కారణంగా పట్టణం పది కిలో మీటర్ల వరకు విస్తరించిందన్నారు. నల్లగొండకు టూరిస్ట్ పర్యాటకుడి లాగా ఏడాదికోసారి వచ్చే వెళ్లే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వాళ్లు కావాలా లేదా ఏడాది పొడవునా ఇక్కడే ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించే నాయకుడు కావాలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారురు.
ప్రధానంగా వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ వార్డులో ప్రజలు పెద్ద సంఖ్యలో కంచర్లకు బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళలు తిలక దిద్ది విజయం బీఆర్ఎస్దే అన్న అని కంచర్లకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో రూ.1,400 కోట్లు వెచ్చించి పది కిలోమీటర్ల మేరకు ఈ పట్టణాన్ని విస్తరిస్తుంటే దీన్ని పట్టించుకోకుండా మున్సిపల్ వైస్ చైర్మన్తో పాటు కొందరు కౌన్సిలర్లు డబ్బు సం చుల కోసం పార్టీ మారినట్లు విమర్శించారు. అబ్బగోని రమేశ్ అవినీతికి కేరాఫ్ అని వార్డు అభివృద్ధ్దిని గురించి పట్టించుకోలేదన్నారు.
అలాంటి నాయకులకు తగిన బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికల్లో నల్లగొండలో బీఆర్ఎస్ జెండా ఎగురాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చకిలం అనిల్ కుమార్ మాట్లాడుతూ నల్లగొండలో ఎప్పుడూ లేనంత విధంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో చేసినందున తనకు మరో అవకాశం ఇవ్వాల్సి ఉందన్నారు.
నల్లగొండలో ఐటీ హబ్తో ఇతర ప్రాంతాలకు పోకుండా ఇక్కడే తల్లి దం డ్రుల వద్ద ఉండి ఉద్యోగం చేసుకునే విధంగా నిర్మించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కినట్లు తెలిపారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కు టుంబంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షే మ, అభివృద్ది ఫలాలు పొందినట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ బీఆర్ఎస్ పార్టీలో అధికారం అనుభవించి నేడు కాంగ్రెస్లో చేరినందున ఆయనకు ఈ ఎన్నికల్లో తగిని గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధ్ది నీకు నచ్చలేదా..నీవు పార్టీ ఎందుకు మారావో చెప్పాల్సిన అవసరం ఉందని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, సుంకరి మల్లేశ్ గౌడ్, మాలె శరణ్యారెడ్డి, కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, నవీన్ గౌడ్, పున్న గణేశ్, రామాలయం చైర్మన్ చకిలం వేణుగోపాల్ రావు, సంధ్యారాణి, డాక్టర్ చెరుకు సువాస్, సింగం లక్ష్మి, యాట జయప్రదారెడ్డి, చింతల యాదగిరి, రంజిత్, సింగారపు విజయ్, నాగరాజు పాల్గొన్నారు.