నీలగిరి, డిసెంబర్ 12 : నల్లగొండ పట్టణం మరో ఆరు నెలల్లో అద్భుత పట్టణంగా మారనున్నదని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. సోమవారం ఆమె ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, జిల్లా కలెక్టర్ టి.వినయ్కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను, ఉదయ సముద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను గతంలో వచ్చినప్పటి నల్లగొండకు, ఇప్పటి నల్లగొండకు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. నల్లగొండ పట్టణాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకోవడంతో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో పట్టణ రూపురేఖలు మారిపోతున్నాయని అన్నారు. ఉదయ సముద్రంలో తీగల వంతెన, ట్యాంక్బండ్ విస్తరణ, నెక్లెస్ రోడ్తో పట్టణం టూరిజం హబ్గా మారనుందన్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా, మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ రమణాచారి, కౌన్సిలర్లు వట్టిపల్లి శ్రీనివాస్, గోగుల శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్రెడ్డి, నాయకుడు జనార్దన్రావు ఉన్నారు.