నల్లగొండ: నల్లగొండ డీసీసీబీ గడిచిన ఏడాదిలోనే పాలక వర్గ సభ్యుల సహకారం, ఉద్యోగుల కృషితో రూ.900 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకు టర్నోవర్ సాధించిందని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్థానిక జిల్లా కేంద్ర బ్యాంకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రధా నంగా రైతు రుణాలపై దృష్టి పెట్టి ఇప్పటివరకు రూ.506 కోట్లు వారికే రుణ రూపంలో అందజేసినట్లు తెలిపారు.
ఇక దీర్ఘ కాలిక రుణాలు రూ.180 కోట్లు, బంగారు రుణాలు రూ.215 కోట్లు ఇవ్వగా గృహ, వ్యాపార రుణాలతో పాటు ఇతర రుణాలు మరో రూ.250 కోట్ల వరకు ఇచ్చిన ట్లు తెలిపారు. అయితే రైతులకు ఎంతో నమ్మకంగా ఉండే ఈ బ్యాంకు లో రూ.470 కోట్లు డిపాజిట్ల రూపంలో బ్యాంకు వచ్చాయని అన్నారు. రాష్ట్రంలో ఏ బ్యాంకులో లేని విధంగా ఎంతో భద్రత కలిగిన లాకర్స్ ఉన్నాయని అన్నారు. భూమి తనఖాతో ఏ బ్యాంకు ఇవ్వని విద్యా రుణాలు ఇప్పటి వరకు 200 మంది రైతు బిడ్డలకు ఇచ్చినట్లు తెలిపారు.
దీర్ఘకాలిక అప్పులకు గతంలో ఎకరాకు రూ.2.50లక్షల లిమిట్ ఉండగా ప్రస్తుతం దాన్ని రూ. 5లక్షలకు పెంచినట్లు తెలి పారు. పంట రుణాలు సైతం గతంలో గరిష్టంగా లక్ష వరకు ఇవ్వగా ప్రస్తుతం దాన్ని రూ.3లక్షల వరకు పెంచినట్లు తెలి పారు. ఏడాదిలో రూ.600 కోట్ల టర్నోవర్ సాదించటంతో గ్రాస్ ప్రాఫిట్ రూ.11 కోట్లు, నెట్ ప్రాఫిట్ రూ.6. 5 కోట్లు సాధిం చామన్నారు. ఉద్యోగులు బ్యాంకు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుండటంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ప్రతి ఉద్యోగికి రెండు నెలల బోనస్ అందజేశామన్నారు.
నల్లగొండ డీసీసీబీ పురోగతి బాగుంది: నాబార్డు సీజీఎం
నల్లగొండ డీసీసీబీ పురోగతి ఇటీవల బాగా పెరిగిందని నాబార్డు తెలంగాణ రీజినల్ సీజీఎం వై క్రిష్ణారావు అన్నారు. బుధవారం ఆయన జిల్లా కేంద్ర సహకార బ్యాంకును సంద ర్శించి రికార్డులు పరిశీలించి ఎవరికి ఏఏ రుణాలు ఇచ్చారు.. ఏ మేరకు ఇచ్చారు.. లాభనష్టాలు ఏంటి..రైతులకు చేస్తున్న సేవలు ఏంటి అనే కోణంలో అధికారులను అడిగి తెలు సుకోని సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు రుణాలు ఇవ్వటంతో పాటు వ్యాపార రుణాలు సైతం పెంచుకుంటే బ్యాంకు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డితో పాటు సీఈవో మదన్ మోహన్, ఉద్యోగులు ఆయనకు బొకే అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం దసరా పండుగ సందర్భంగా ఉద్యోగులకు రెండు నెలల బోనస్ అందించడంతో వారు చైర్మన్ను సన్మానించారు.