హాలియా/నిడమనూరు/త్రిపురారం, ఏప్రిల్ 5 : టీఆర్ఎస్ పాలనలోనే వృత్తులకు పునరుజ్జీవం లభించిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. త్రిపురారం మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎన్నికల మండల ఇన్చార్జి, మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోతు శంకర్నాయక్తో కలిసి గడప గడపకూ ప్రచారం నిర్వహించారు. రాత్రి నిడమనూరు మండల కేంద్రంలో యాదవులతో సమావేశమయ్యారు. గొర్రెల పంపిణీతో పాటు యాదవులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్న సీఎం కేసీఆర్కు మద్దతుగా భగత్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీపీ బొల్లం జయమ్మ, రవి పాల్గొన్నారు. అనంతరం మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి హాలియా మండలం మారేపల్లిలో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోని చేరిన వారికి మంత్రులు గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొన్నారు.
ప్రచార యాత్ర కాదు.. విజయోత్సవ ర్యాలీ: ఎమ్మెల్సీ పోచంపల్లి
ఇప్పుడు జరుగుతుంది ప్రచార యాత్ర కాదు.. విజయోత్సవ ర్యాలీ అని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం ఖాయమైందని, జానాకు ఓటమి తప్పదని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎన్నికల మండల ఇన్చార్జి, మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోతు శంకర్నాయక్, మిర్యాలగూడ జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్నాయక్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు అనంతరెడ్డి, వాసుదేవరెడ్డి, బైరెడ్డి కవిత, నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కామెర్ల జానయ్య, నాయకులు మర్ల చంద్రారెడ్డి పాల్గొన్నారు.
జానారెడ్డికే ఓటేసినా.. నీళ్లు కండ్లజూడలే..
నాకు ఓటు వచ్చినకాన్నుంచి జానారెడ్డికే వేస్తున్న. అయినా ఏం లాభం లేకుంట పోయింది. తండా దగ్గరనే ఏరు పారుతున్నా మా భూములు ఎండబెట్టుకున్నం. కేసీఆర్ సారు వచ్చినంకనే లిప్టులు మొదలైనయి. జానారెడ్డికి ఓటు వేసి ముసలోళ్లం అయినం. కానీ నీళ్లు కండ్లజూడలే. ఈ సారి టీఆర్ఎస్కే ఓటు వేస్తం.
ఏ సర్కారు గూడ మమ్మల్నిట్ల చూస్కోలే..
‘200రూపాయలున్న పింఛన్ను కేసీఆర్ సారు 2వేలు చేసిండు. ఆ డబ్బులతోనే నెల నెలా మందులు కొనుక్కుంటున్న. ఆఫీసర్లు మా తండాకే వచ్చి పింఛన్ ఇస్తున్నరు. కొడుకులు, కోడళ్లు కూడా బాగ చూసుకుంటున్నరు. ఇంతకు ముందు ఏ సర్కారు కూడా ఇట్ల ఇయ్యలేదు.’
ఇవీ కూడా చదవండి…
టీఆర్ఎస్ పాలనలోనే సాగర్ అభివృద్ధి