నార్కట్పల్లి డిసెంబర్ 30 : మండలంలోని నక్కలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడితోపాటు మరో నలుగురు ఉపాధ్యాయులు సెలవు పెట్టడంతో డీఈఓతో మాట్లాడారు. అనుమతి తీసుకోకుండా సెలవుపై వెళ్లిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఉపాధ్యాయులు సెలవులు పెడితే పిల్లలకు చదువు ఎవరు చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీటీసీ కనుకు అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు ఈద నర్సింహ, శ్రీపతి సైదులు, రవికుమార్, కరుణాకర్ రెడ్డి, వెంకన్న, జిల్లా పృథథ్వీ పాల్గొన్నారు.
పల్లెపహాడ్ సర్పంచ్కు పరామర్శ
ప్రమాదవశాత్తు జారి పడి విశ్రాంతి తీసుకుంటున్న మండలంలోని పల్లెపహాడ్ సర్పంచ్ రామచంద్రారెడ్డిని జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఆయన వెంట జిల్లా గ్రంధాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ యానాల అశోక్ రెడ్డి, ఎంపీటీసీలు పుల్లెంల ముత్తయ్య, అంజయ్య, రాజిరెడ్డి, నర్సింహ, కరుణాకర్రెడ్డి ఉన్నారు