నకిరేకల్, డిసెంబర్ 11: నిరుపేద కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం వరమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ ఏరియా ఆస్పత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రూ.10 లక్షల ఆరోగ్యసేవలకుసంబంధించిన పోస్టర్ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తనపై పెట్టిన బరువు, బాధ్యతలను 24 గంటలు వారి సంక్షేమం, అభివృద్ధ్ది కోసం పనిచేస్తానన్నారు.
రేషన్కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులన్నారు. కుటు ంబంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఒక సంవత్సరంలో రూ.10 లక్షల వరకూ ఈ పథకం వర్తిస్తుందన్నారు. గతంలో ఈ పథకం కింద 1,326 జబ్బులకు మాత్రమే చికిత్స అందుతుండేదని, ప్రస్తుతం 1,600 పైచిలుకు జబ్బులకు వర్తిస్తుందన్నారు. గ్రామాల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవల గురించి వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు తెలియజేయాలని సూచించారు. అంతకుముందు ఆయా పీహెచ్సీల వైద్య సిబ్బంది, వైద్యాధికారులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువాలతో సన్మానించారు.
అనంతరం ఏరియా ఆస్పత్రిలోని పలు వార్డులను రికార్డులను ఎమ్మెల్యే తతతనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మున్సిపల్ చైర్మన్లు రాచకొండ శ్రీనివాస్, కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి, ఎంపీపీలు బచ్చుపల్లి శ్రీదేవీగంగాధర్, పెరుమాళ్ల శేఖర్, జెల్ల ముత్తిలింగం, తాసీల్దార్ గుగులోతు ప్రసాద్ నాయక్, మున్సిపల్ కమిషనర్ బాలాజీ, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, డీసీహెచ్ఎస్ మాతృనాయక్, జీఎం ఇండస్ట్రీస్, స్పెషల్ ఆఫీసర్ కోటేశ్వర్రావు, డీఎంహెచ్ఓ కొండల్రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, ఎస్ఐ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.