హాలియా, జనవరి 3 : ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ పిలుపునిచ్చారు.
మంగళవారం ఆరోగ్యశాఖ మంత్రి హరిశ్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులతో చేపట్టిన వీడియో కాన్ఫరెన్స్కు హాలియా తాసీల్దార్ కార్యాలయంలో అధికారులతో కలిసి హాజరయ్యారు.
కార్యక్రమంలో తాసీల్దార్ మంగ, మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, హాలియా, నాగార్జునసాగర్ మున్సిపల్ కమిషనర్లు వీరారెడ్డి, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.