త్రిపురారం, నవంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని నాగార్జునసాగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన ప్రచార కార్యక్రమంలో కోలాటాలు, డప్పులు, మంగళహారతులు, బోనాలతో నాయకులకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు ప్రతి మహిళకు కావాల్సిన అన్నిరకాల పథకాలను అందిస్తున్న సీఎం కేసీఆర్ అని అన్నారు. 2018 తరువాత నే నాగార్జునసాగర్ అభివృద్ధి చెందిందన్నారు. నిత్యం మీ మధ్యనే ఉంటూ మీ కొడుకులా సేవ చేస్తున్న తనను ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించే నాయకుడు సీఎం కేసీఆర్ అని, ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు.
రైతు పక్షపాతి బీఆర్ఎస్ ప్రభుత్వమని ఎమ్మెల్సీ కో టిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. నాణ్యమైన విద్యు త్ అందిస్తూ రైతుల పంట పొలాలకు సాగునీరు అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేన అన్నారు. పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తూ రైతులను ఆదుకుంటుందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుల, మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని గుర్తు చేశారు. ప్రజల మనిషిగా ముద్ర వేసుకున్న భగత్ కారు గుర్తుపై ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
నాగార్జునసాగర్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు 35 ఏండ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్నో పదవులను అనుభవించి ఉన్న నాయకుడు నియోజకవ ర్గానికి చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో ఒక డిగ్రీ కళాశాల కూడా తెప్పించలేని నా యకుడు సీఎంగా నేనే ఉంటానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నిక లప్పుడే కనిపించే నాయకులను ప్రజలు నమ్మరన్నారు. ప్రతి గ్రామగ్రామాన అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరారు. నాగార్జునసాగర్ గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రెండున్నరేండ్లలో నోముల భగత్ నాగార్జునసాగర్లో అభివృద్ధికి బాటలు వేశారని ఆయన తెలిపారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ ధ్యేయమని ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్ అన్నారు. మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారని అన్నారు. మూడో సారి కేసీఆర్ సీఎం కావాలని, అందుకోసం మీరిక్కడ కారు గుర్తుపై ఓటేసి భగత్ను గెలిపించాలని ఆయన కోరారు. సర్పంచ్ అనుముల శ్రీనివాస్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బహునూతల నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కడారి అంజయ్యయాదవ్, నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ చైర్మన్ కామెర్ల జానయ్య, అనుముల శ్రీనివాస్రెడ్డి, ధూళి పాల రామచంద్రయ్య, మహిళ అధ్యక్షురాలు ధనలక్ష్మీ, ప్రధాన కార్యదర్శి వెంకటాచారి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు దస్తగిరి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు చందునాయక్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సైదు లు, నాయకులు శ్యాంసుందర్రెడ్డి, జంగిలి శ్రీనివాస్, చింతకాయల యాదయ్య, బైరం కృష్ణ, పులిజాల జ్యోతి, చింతకాయల నాగమణి, చంద్రకళ, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.