నందికొండ, ఆగస్టు 23 : శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు వరద ఉధృతి తగ్గడంతో సోమవారం ఉదయం 7 గంటలకు ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను అధికారులు మూసి వేశారు. ఎగువ ప్రాంతాల నుంచి సాగర్ రిజర్వాయర్లోకి 63,336 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312 టీఎంసీ) కాగా ప్రస్తుతం 588.20 అడుగులు (306.6922 టీఎంసీ) ఉంది. రిజర్వాయర్ నుంచి కుడికాల్వకు 9,217 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,108, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 3,2917, ఎస్ఎల్బీసీకి 2,400, వరద కాల్వకు 400 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది.
శ్రీశైలం సమాచారం
శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 884.40 ( 212.4385టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 1,55,016 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది.
మూసీకి 1093 క్యూసెక్కుల ఇన్ఫ్లో
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు మంగళవారం ఎగువ ప్రాంతాల నుంచి 1093.72 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు కుడి కాల్వకు 255.25, ఎడమ కాల్వకు 202.70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల లేదు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 640.05 అడుగులుగా(3.23 టీఎంసీలు) ఉన్నట్లు ఏఈ ఉదయ్కుమార్ తెలిపారు.