మర్రిగూడ: శివన్నగూడెం ప్రాజెక్టు పరిధిలో భూములు, ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని దేవరకొండ ఆర్డీవో గోపీరాం నాయక్ వెల్లడించారు. ప్రాజె క్టులో ముంపునకు గురవుతున్న వెంకెపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం మంగళవారం గ్రామ సభ నిర్వహించారు.
గ్రామంలో 436 ఇండ్లకు డీఎల్ఐఎస్ నంబర్లు కేటాయించగా 18 సంవత్సరాలు దాటిన వారు 131మంది ఉన్నారని పేర్కొన్నారు. ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం తరుపున 7.61లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని మేజరైన వారికి కూడా ఇదే నష్టపరిహారం వర్తిస్తుందన్నారు. డీఎల్ఐఎస్ నంబర్లు కేటాయించకుండా ఇంకా అర్హులు మిగిలి ఉంటే దరఖాస్తు చేసుకో వాలని సూచించారు.
18 సంవత్సరాలు నిండినప్పటికీ తమ పేర్లు నమోదు కాలేదని నిర్వాసితులు ఆందోళన చేయడంతో అధికారులు సమావేశాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. సమావేశంలో ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి, తాసీల్దార్ జి.దేశ్యానాయక్, సర్పంచ్ కొర్ర శ్రీనునాయక్, ఎంపీటీసీ తుమ్మల వరప్రసాద్, డీఈ లక్ష్మయ్య, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.