యాదాద్రి, డిసెంబర్ 20 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు కొండపైకి వెళ్లే భక్తుల కోసం అధునాతన దేవస్థాన బస్సు ప్రాంగణం త్వరలో అందుబాటులోకి రానున్నది. కొండ కింద లక్ష్మీ పుష్కరిణి పక్కన నూతనంగా నిర్మిస్తున్న బస్ టెర్మినల్ వెనుక భాగంలో మూడెకరాల విస్తీర్ణంలో దేవస్థాన ప్రత్యేక బస్సు ప్రాంగణం నిర్మాణాన్ని వైటీడీఏ అధికారులు చేపటా ్టరు. రూ.8.78 కోట్లతో నిర్మించే ఈ బస్సు ప్రా ంగణంలో 10 ఫ్లాట్ ఫామ్లు నిర్మించనుండగా పనులు కొనసాగుతున్నాయి.
బస్టాండ్లో టికెట్ కౌంటర్, 2 ఏటీఎం సెంటర్లు, 5 షాపులు, క్లాక్ రూం, ఎగ్జిట్ లాబీ, కామన్ వెయిటింగ్ ఏరియా, స్త్రీలు, పురుషులకు ప్రత్యేక మరుగుదొడ్లు, ఇన్చార్జి రూమ్లను నిర్మిస్తున్నారు. బస్టాం డ్ ప్రాంగణానికి ఆథ్యాత్మికత సంతరించుకునేలా దేవతామూర్తుల రూపాలు, వివిధ ఆధ్యాత్మిక ఆకృతులతో మెరుగులు దిద్దనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కొండ కింద నిర్మించిన బస్ టెర్మినల్కు చేరుకుంటారు. అక్కడి నుంచి దేవస్థానం వెళ్లేందుకు ప్రత్యేకంగా నిర్మించే బస్సు ప్రాంగణం వద్దకు చేరుకొని ప్రత్యేకమైన బస్సుల్లో కొండపైకి వెళ్లనున్నారు. 30 శాతం పనులు పూర్తయ్యాయని వైటీడీఏ అధికారులు తెలిపారు.