పెద్దఅడిశర్లపల్లి, ఏప్రిల్ 4 : ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మండలంలోని మేడారం గ్రామానికి చెందిన ఎంపీటీసీ నక్క రాములు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకొన్నారు.
ఈ సందర్భంగా రవీంద్రకుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులు తప్ప 120 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఎల్గూరి వల్లపురెడ్డి, రాష్ట్ర నాయకులు పల్లా ప్రవీణ్రెడ్డి, తోటకూరి పరమేశ్యాదవ్, ఎర్ర యాదగిరి, మాద సుధాకర్గౌడ్ పాల్గొన్నారు.