మోటకొండూర్, సెప్టెంబర్ 14: మోటకొండూర్ గ్రామాభివృద్ధికి మరింత సహకారం అందించాలని సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత మంత్రి తన్నీరు హరీశ్రావును కోరారు. స్థానిక పీహెచ్సీలో 24 గంటల వైద్య సేవలకు కృషి చేసిన మంత్రిని బుధవారం ఆయన నివాసంలో గ్రామస్తులతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మంత్రి హరీశ్రావుకు గ్రామస్తులంతా రుణపడి ఉంటారన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు అనంతుల నర్సింహారెడ్డి, సదాశివుడు, బాలగోని సత్యనారాయణ, బాల్ద రామకృష్ణ, గడ్డం అంజయ్య, ఉప్పలయ్య, తిరుమలరెడ్డి, రవీందర్, నరేశ్, మల్లేశ్, జహంగీర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్కు కృతజ్ఞతలు
మోటకొండూర్ : పీహెచ్సీలో 24 గంటల వైద్య సేవలు అందనుండడంతో టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డిని యాదగిరిగుట్టలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ విప్ను కలిసిన వారిలో ఎంపీపీ పైళ్ల ఇందిరాసత్యనారాయణరెడ్డి, జడ్పీటీసీ పల్లా వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, వైస్ ఎంపీపీ ఇల్లెందుల మల్లేశ్గౌడ్, నార్మూల్ డైరెక్టర్ లింగాల శ్రీకర్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనంతుల జంగారెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు బురాన్, పార్టీ సెక్రటరీ జనరల్ ఎర్ర మల్లేశ్, ప్రధాన కార్యదర్శి భూరెడ్డి రవీందర్రెడ్డి, యూత్ అధ్యక్షుడు బీస కృష్ణంరాజు, టీఆర్ఎస్వీ ఆలేరు కన్వీనర్ పన్నీరు భరత్, యూత్ సెక్రటరీ జనరల్ నవీన్రెడ్డి, జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్కిరణ్, ఆరెగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు పాండురంగారెడ్డి, పలువురు నాయకులు ఉన్నారు.