కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా ఆదివారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 6396.90 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 3839.53 క్యూసెక్కులు, కాలువలకు 191.17 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 643.20 అడుగులు (3.99 టీఎం సీలు) నిల్వ ఉన్నట్లు ఏఈ డి.ఉదయ్కుమార్ తెలిపారు. ప్రాజెక్టు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేసినందున పరివాహక ప్రాంత రైతులు, గొర్రెలు, మేకల కాపర్లు, మత్స్యకారులు నదిలోకి వెళ్లోద్దని ఏఈ కోరారు.