హాలియా, ఫిబ్రవరి 10 : గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం అని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం అనుముల మండలం హజారిగూడెంలో రూ. 10 లక్షల సీడీపీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామం నిర్మించడంతో ఇంటింటికీ తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టి దేశంలో తెలంగాణను అభివృద్ధిలో అగ్రభాగాన ఉంచినట్లు పేర్కొ న్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గాభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యం అన్నారు. కార్యక్రమంలో అనుముల, తిరుమలగిరి సాగర్ ఎంపీపీలు సుమతీపురుషోత్తం, భగవాన్నాయక్, జడ్పీటీసీ సూర్యభాష్యనాయక్, సర్పంచ్ వద్దిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ రావుల రాంబాబు, బీఆర్ఎస్ నాయకులు గుంటుక మధు, భాస్కర్రావు, రాంబాబు, బుగ్గయ్య, వెంకన్న, పెద్దిరాజు, వెంకటేశ్వర్లు, కిరణ్నాయక్, రామునాయక్, వివిధ పార్టీల నాయకులు చినభిక్షం పాల్గొన్నారు.