రామగిరి, మార్చి 10 : బీసీల హక్కుల సాధన కోసం సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా రౌండ్ టేబుల్ సమావేశాన్ని యునైటెడ్ పూలే ఫ్రంట్, భారత జాగృతి సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు భారత జాగృతి జిల్లా కన్వీనర్ బోనగిరి దేవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని చిన వెంకట్రెడ్డి ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందని, దీనికి ముఖ్య అతిథిగా భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. బీసీ, కుల సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.