నల్లగొండలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి ఘనవిజయం సాధించారు. తొలి ప్రాధాన్యతా ఓట్లలో ఆయనకు భారీ మెజార్టీ వచ్చింది. నల్లగొండలో మొత్తం 1271 ఓట్లకుగానూ 1233 ఓట్లు పోలయ్యాయి.
వీటిలో 50 ఓట్లు చెల్లనివని అధికారులు తేల్చారు. దీంతో ఇక్కడ గెలుపు కోటా 593కు చేరింది. ఈ క్రమంలోనే కోటిరెడ్డికి ఏకంగా 917 ఓట్లు వచ్చాయి. ఆయనపై పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి నగేష్కు 226 ఓట్లు వచ్చాయి. మొత్తం 691 ఓట్ల మెజార్టీతో కోటిరెడ్డి విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైన సంగతి తెలిసిందే.