నకిరేకల్, ఫిబ్రవరి 28 : టైలర్ల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందిస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ప్రపంచ టైలర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నకిరేకల్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇందిరాగాంధీ మెయిన్ సెంటర్లో ఏర్పాటు చేసిన టైలర్స్ అసోసియేషన్ జెండాను ఎమ్మెల్యే వేముల వీరేశం ఆవిష్కరించా రు.
అనంతరం పట్టణంలోని గుడిపాటి ఫంక్షన్ హాల్ నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. టైలర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందనారు. సమావేశంలో అసోసియేషన్గౌరవాధ్యక్షుడు సామల సత్యనారాయణ, అధ్యక్షుడు వనం నరేందర్, ఉపాధ్యక్షులు చిట్యాల దావీద్, ప్రధాన కార్యదర్శి కాటబత్తిని రమేశ్, కోశాధికారి పెండెం యాదగిరి పాల్గొన్నారు.
మునుగోడు : మండల కేంద్రంలో బుధవారం టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టైలర్స్ డేను నిర్వహించారు. స్థానిక చౌరస్తాలో కుట్టు మిషన్ రూపకర్త విలయమ్స్ హౌవే చిత్రపటానికి టైలర్స్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీనియర్ టైలర్లను శాలువాలుతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మిర్యాల వెంకన్న, టైలర్లు పాల్గొన్నారు.
హాలియా :హాలియా టైలర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రధాన సెంటర్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కుట్టుమిషన్ సృష్టికర్త ఎలియాస్ హువే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.