శాలిగౌరారం, జనవరి 7: నకిరేకల్ తాలూకా ప్రజలకు కామ్రేడ్ లింగయ్య చేసిన సేవలు మరువలేనివని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ సమితి మాజీ అధ్యక్షుడు పనికెర లింగయ్య స్వగ్రామమైన మండలంలోని గురజాలలో ఆదివారం లింగయ్య ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. ఈసందర్భంగా లింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు.
పీడిత ప్రజల అభివృద్ధి కోసం అలుపెరుగని వీరుడు యోధుడని, ప్రజల సమస్యల సాధన కోసం లింగయ్య సేవలు చిరస్థాయిలో గుర్తుండిపోతాయన్నారు. లింగయ్య స్థూపం వద్ద నివాళులర్పించి మౌనం పాటించారు. కార్యక్రమంలోజడ్పీటీసీ ఎర్ర రణీలాయాదగిరి, సర్పంచ్ గుండా శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్కుమార్రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్, మండలాధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, నోముల జనార్దన్, బొడ్డు సోమలింగయ్య, చెలకాని మల్లయ్య, పనికెర కిష్టయ్య, జహంగీర్, ననుబోతుల అంజయ్య, పాల్గొన్నారు.
నార్కట్పల్లి : మండలంలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరుతూ సీపీఎం మండలకమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేముల వీరేశానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు, పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాల్వ, డబుల్ బెడ్రూం ఇండ్లు పెండింగ్ పనులను పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలోకార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎస్ఆర్ వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరి, చెరుకు పెద్దులు, చింతపల్లి బయ్యన్న, దండు రవి, జాల యాదయ్య పాల్గొన్నారు.