బీబీనగర్(భూదాన్పోచంపల్లి) జూలై 20 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరంలాంటివని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. గురువారం భూదాన్పోచంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఆయన మాట్లాడారు. పేదింటి మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నలా వ్యవహిరిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు.
అనంతరం 44 మంది లబ్ధిదారులకు చెక్కులతో పాటు తన సొంత డబ్బులతో పట్టుచీర, పట్టుదోవతిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్, వైస్ చైర్మన్ బాతుక లింగస్వామి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్యాదవ్, పీఏసీఎస్ చైర్మన్లు కందాడి భూపాల్రెడ్డి, అందెల లింగంయాదవ్, తాసీల్దార్ వీరాబాయి, ఎంపీడీఓ బాలశంకర్, నాయకులు పాటి సుధాకర్రెడ్డి, సీత వెంకటశం, కోట మల్లారెడ్డి, ముత్యాల మైపాల్రెడ్డి, కర్ణాటి రవీందర్, గుండు మధు, సామల మల్లారెడ్డి, పెద్దల చక్రపాణి, దేవరాయ కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని పిలాయిపల్లిలో కంకర మిషన్ల యాజమానుల సహకారంతో పిల్లాయిపల్లి నుంచి గువ్వాలేటి గ్రామం వరకు చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బుధవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.