హుజూర్నగర్, జనవరి 28 : కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీనియర్, యువ నాయకులు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు. జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముడెం గోపిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు తోట పెద్ద కోటేశ్వర్రావు, తోట శ్రీనివాస్రావు, కాంగ్రెస్ నాయకులు హసన్మియా, మన్నాన్, మాణిక్యం నర్సింహారావులతో పాటు మరో 15కుటుంబాల వారు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో సర్పంచ్ గల్లా సైదులు, గ్రామశాఖ అధ్యక్షుడు ఎండీ.ముజీబ్, వార్డు మెంబర్లు తోట భిక్షం, గల్లా నర్సింహారావు, జాని, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హుజూర్నగర్ : మండలంలోని లక్కవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు వంద మంది సర్పంచ్ సౌజన్య నరేశ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు కస్తాల కొండల్ పాల్గొన్నారు.