నల్లగొండ : టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రగతి విప్లవం కొనసాగుతోందని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. ఆదివారం దేవరకొండ మండల పెద్ద తండాలో రూ.10 లక్షలతో, శేరిపల్లి గ్రామంలో రూ.15లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహర్దశ వచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల చేతుల్లో నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన అనేక గ్రామాలు టీఆర్ఎస్ పాలనలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ, జడ్పీటీసీ మారుపాకుల అరుణ గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్,రైతు బంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, సర్పంచులు మడెం సత్తయ్య, రమావత్ పద్మతులచ్య నాయక్, ఎంపీటీసీ రమావత్ నర్సింహ, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పళ్లెం శ్రీను, రమావత్ కిష్టు, బొడ్డుపల్లి కృష్ణ, మేడం ఇద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.