పెద్దఅడిశర్లపల్లి: రైతులకు నాణ్యమైన విత్తనాలు,ఎరువుల అందించాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం మండలంలోని రంగారెడ్డి గూడెం స్టేజీ వద్ద రైతు అగ్రో సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ తెలంగాణ రైతాంగానికి సాగు నీటిలో పాటు అనేక రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్కే దక్కిందని అన్నారు. వ్యవసాయ రంగంలో కేసీఆర్ సర్కారు నూతన ఒరవడికి శ్రీకారంచుట్టి రైతు బంధు, రైతుబీమా లాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని దేశం మొత్తం తెలంగాణ రైతాంగం వైపు చూసేలా వ్యవసాయాన్నికేసీఆర్ అభివృద్ది చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీవంగాల ప్రతాప్రెడ్డి, మాజీ మార్కెట్ కమిటి వైస్చైర్మన్ ముచ్చర్ల ఏడుకొండల్యాదవ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు రేటినేని ముత్యంరావు, నాయుకులు మునగాల అంజిరెడ్డి, జగన్, ఎర్ర యాదగిరి, గురువయ్య, తదితరులు పాల్గొన్నారు.