నల్లగొండ : మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆడబిడ్డలకు దసరా కానుకగా సర్కారు సారె అందజేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తెలిపారు. బుధవారం పీఏపల్లి మండల కేంద్రంలో బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ సర్కారు పాటుపడుతుందన్నారు.
బతుకమ్మ చీరల పంపిణీతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలందరికి తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ కానుకగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఎవరు అడగకముందే ప్రజలకు కావాల్సిన సంక్షేమాన్ని గుర్తించి ప్రజల అవసరాలను తీరుస్తున్నారని గుర్తు చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సిరందాసు లక్ష్మమ్మ, పీఏసీఎస్ చైర్మన్ వెలుగురి వల్లపురెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య, మండల వైస్ ఎంపీపీ అర్వపల్లి సరిత, స్థానిక సర్పంచ్ గొర్ల సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.