మాల్, నవంబర్ 26: తెలంగాణకు సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం చింతపల్లి మండలంలోని హరిజనాపురం, గడియ గౌరారం, కిష్టరాయినిపల్లితో పాటు పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధిని చూసి.. మరో అవకాశమివ్వాలని కోరారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని అన్నారు. ప్రతిపక్షాల మాటలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు వారెంటీ లేదని ఎద్దేవా చేశారు.
రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రవేశ పెట్టింది బీఆర్ఎస్ పార్టీయే అని అన్నారు. 3గంటలు విద్యుత్ చాలు అన్న కాంగ్రెస్, మోటర్లకు మీటర్లు పెట్టమన్న బీజేపీలకు ఓటేస్తారా… 24 గంటల కరెంట్ అందిస్తున్న బీఆర్ఎస్ ఓటేస్తారని అని ప్రశ్నించారు. 60 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. మూడో సారి కేసీఆర్ సీఎం కాగానే తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలి పారు.
పదేండ్లలో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని ప్రగతి బాట పట్టించారని తెలిపారు. కారు గుర్తుకు ఓటేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్రెడ్డి, కేతావత్ బిల్యా నాయక్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, కిష్టారెడ్డి, సాగర్రావు, నరేందర్రావుతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
డిండి: స్థానిక పంచాయతీ పరిధిలోని ఎడ్లగడ్డ తండాకు చెందిన 30మంది యువకులు ఆదివారం ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే రవీంద్రకుమార్ బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వర్రావు, గిరమోని శ్రీనివాసులు, గుర్రం రాములు, మేకల కాశన్న, రవిచౌహాన్, పున్నలింగమయ్య, శ్రీనివాస్గౌడ్, కలీం తదితరులు పాల్గొన్నారు.