దేవరకొండ రూరల్, జనవరి 8 : భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన డిండి మండలం సింగరాజ్పల్లి రిజర్వాయర్ కింద మొయిన్ కెనాల్లో ముంపునకు గురైన వీరబోయినపల్లి గ్రామ 32మంది రైతులకు రూ.1.70 కోట్ల పరిహారం చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్ల కింద బోములు కోల్పోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు.
నక్కలగండి, డిండి ప్రాజెక్టులు, లిఫ్టులు పూర్తయితే దేవరకొండ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికీ సాగునీరు అందుతుందన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా రిజర్వాయర్లు ఉన్న నియోజకవర్గం దేవరకొండ అని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎం పీపీ మాధవరం సునీతాజనార్దన్రావు, తాసీల్దార్ ప్రశాంత్ , రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు రాజీనేని వెంకటేశ్వర్రావు, శిరందాసు కృష్ణయ్య, పీఏసీఎస్ చైర్మన్ తూం నాగార్జున్రెడ్డి, నాయకులు మాధవరం శ్రీనివాస్రావు, పేర్వాల జంగారెడ్డి పాల్గొన్నారు.