కొండమల్లేపల్లి, నవంబర్ 28: కాంగ్రెస్ నాయకులు చెబుతున్న అమలు కాని హామీలను నమ్మి ఓటేస్తే ఆగం అవుతారని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం కొండమల్లేపల్లి మండల కేంద్రం జనసంద్రంగా మారింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన దేవరకొండ బీఆర్ఎస్ అభ్యర్ధి రమావత్ రవీంద్రకుమార్కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ 50 ఏండ్ల కాలంలో కాంగ్రెస్ పాలనలో చేసిన అభివృద్ధి ఏమి లేదని విమర్శించారు.
కాంగ్రెస్ పాలకులు నిర్లక్ష్యం వార్డుల్లో తాగునీటి గోస పడ్డామని, రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పదేండ్లలో రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతుందన్నారు.కొండమల్లేపల్లి పట్టణం మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటేసి తతను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్ రెడ్డి, కడారి అంజయ్య యాదవ్, కుంబం శ్రీనివాస్గౌడ్, మారం రవీం దర్ రెడ్డి, రమావత్ రమేష్నాయక్, జడ్పీటీసీ సరస్వతమ్మ, ఎంపీటీసీ వస్కుల తిరుపతమ్మ కాశయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్, మండల రైతుబంధు అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, జడ్పీటీసీ సలహాదా రుడు పస్నూరీ యుగేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, సర్పంచులు రమావత్ అరుణ శక్రునా యక్,
గుండబోయిన లింగం యాదవ్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షు డు ఎలిమినేటి సాయి, కొడిదాల వెంకటయ్య, తొటపల్లి శ్రీను,గమ్మడవెళ్లి జనార్ధన్, పెద్దిశేట్టి సత్యనారయణ, బోడ గిరి, ముశిని శేఖర్ యా దవ్, వరికుప్పల పాండు, వస్కుల శ్రీను, వస్కుల కాశయ్య, ముడావత్ పాండునాయక్, బావండ్ల దుర్గయ్య,మాడ్గుల యాదగిరి, దాచేపల్లి నరేందర్, అల్గుల సైదిరెడ్డి, తొటపల్లి కిరణ్, కొడిదాల శ్రీను, పంగ లాలయ్య, వెంకటేష్, ఎండీ గౌస్, బీఆర్ఎస్ పార్టీ మండల మహిళ అధ్యక్షురాలు కలమ్మ, పట్టణ అధ్యక్షురాలు పద్మ, ధనమ్మ పాల్గొన్నారు.
దేవరకొండ: రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలిపి, కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 18వ వార్డులోని మాజీ బీసీ సెల్ అధ్యక్షుడు మాకం చంద్రమౌళి, 17వ వార్డులోని 50 మంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే మూడో సారి కేసీఆర్ను సీఎం చేయాలని ఆయన కోరారు. దేవరకొండ నియోజకవర్గంలో కారు గుర్తుకు ఓటేసి అత్యధికంగా మెజార్టీ అందించాలని అభ్యర్థిం చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు హన్మంత్ వెంకటేశ్గౌడ్, జానీబాబ, వార్డు కౌన్సిలర్ వీరమోని అంజిగౌడ్, వైస్ చైర్మన్ రహత్అలీ, నీల రవికుమార్ తదితరులున్నారు.