మిర్యాలగూడ, నవంబర్ 10 : ఇప్పటికే మిర్యాలగూడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చేయాలన్ననే తన ధ్యేయమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మార్నింగ్ వాకర్స్తోపాటు ఓపెన్ జిమ్ చేస్తున్న పలువురిని ఆయన కలిసి రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఇప్పటి వరకు తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. పట్టణ ప్రజల ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో పార్కులు, ఓపెన్జిమ్లతో పాటు పట్టణంలో పరిశుభ్ర వాతావరణాన్ని, వసతులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మిర్యాలగూడ సమగ్రాభివృద్ధి కోసం మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, కౌన్సిలర్ ఉదయ్భాస్కర్గౌడ్, నాయకులు పశ్యా శ్రీనివాస్రెడ్డి, మన్నెం శ్రీనివాస్రెడ్డి, ఘంటా శ్రవణ్రెడ్డి, సక్రాంనాయక్, కుర్ర కృష్ణకాంత్, వాంకుడోతు సురేశ్నాయక్, రెహమాన్ఖాన్, శ్రీనునాయక్ ఉన్నారు.
మిర్యాలగూడ : ఎన్నికల మ్యానిఫెస్టోను వందశాతం అమలు చేస్తున్న ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని రవీంద్రనగర్, నందిగూడెం క్యాంపు, సంతోష్నగర్, గాంధీబొమ్మ, అశోక్నగర్, సాగర్ రోడ్డు, శాంతినగర్, కృష్ణ్ణకాలనీ, కృష్ణమానసకాలనీలో బీఆర్ఎస్ ప్రగతి యాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే ఆయా ప్రాంతాల్లో ప్రజలను కలుసుకొని తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఆయా ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఎమ్మెల్యేను అపూర్వంగా స్వాగతించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కర్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ మానిఫెస్టోలో ప్రకటించిన అన్ని సంక్షేమ పథకాలను ఎన్నికల్లో గెలిచిన వెంటనే అమలు చేసి లబ్దిదారులకు చేయూతనిస్తామని చెప్పారు. సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా అర్హులైన ఆడబిడ్డలందరికీ ప్రతి నెలా రూ.3వేల భృతి అందిస్తామన్నారు. రూ.4 వందలకే గ్యాస్ సిలిండర్, నిరుపేద కుటుంబానికి బీమా అందించనున్నట్లు చెప్పారు. పట్టణంలోని 10, 24, 25, 26, 39, 40వార్డుల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడంతో పాటు అనేక వేల కోట్ల సంక్షేమ పథకాలను అందించినట్లు తెలిపారు. ఎప్పుడూ ప్రజల సమస్యలు పట్టించుకోని వారు. ఎక్కడా రూపాయి పెట్టి అభివృద్ధి పనులు చేయనివారు ఎన్నికల ముందు వచ్చి కట్టుకథలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని చెప్పారు.
వారి మాయలో పడొద్దని, బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కారు గుర్తుకు ఓటేసి మరోమారు అభివృద్ధికి అవకాశం ఇవ్వాలన్నారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు నల్లమోతు సిద్ధార్థ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అన్నభీమోజు నాగార్జునాచారి, కౌన్సిలర్లు తలకోన సుజాత, అమృతం దుర్గాసత్యం, గిరి, ఉదయ్భాస్కర్గౌడ్, నాయకులు గొంగిడి సైదిరెడ్డి, వజ్రం, కుందూరు శ్యాంసుందర్రెడ్డి, తలకోన శ్రీధర్రెడ్డి, ఆయిల్ శ్రీను, కందగట్ల అశోక్, ఐల వెంకన్న, కర్నాటి రమేశ్, రేపాల రమేశ్, ముజ్జా రామకృష్ణ, తేలుకుంట్ల శేఖర్ పాల్గొన్నారు.