శాలిగౌరారం, ఫిబ్రవరి 26 : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. సోమవారం యాదవుల ఆరాధ్య దైవం శివగంగ ఆలయ బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామాల్లో ప్రజలు ఐక్యమత్యంగా ఉండి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
అనంతరం యాదవులు ఎమ్మెల్యేను శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, సంఘం అధ్యక్షుడు పెంబెళ్ల భిక్షం, ఉపాధ్యక్షుడు సింగరి రాములు, చీమల మల్లయ్య, చిర్రబోయిన శ్రీనివాస్, చీమల అవిలయ్య, కడారి అంజయ్య, రామస్వామి, బొల్లికొండ గణేశ్, నాయకులు చింత ధునుంజయ్య, ఆకుల శ్రీనివాస్, పుల్లూరి దేవేందర్, నిమ్మల మధుగౌడ్ పాల్గొన్నారు.