శాలిగౌరారం, డిసెంబర్ 31: గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రహదారుల అభివృద్ధ్దికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శాలిగౌరారం నుంచి రామగిరి గ్రామం వరకు రూ.5 కోట్లతో నిర్మించనున్న ఆర్ అండ్ బీ రోడ్డు నిర్మాణం కోసం శిలాఫలకాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని పరిష్కరించే దిశగా తన వంతు కృషి చేస్తానన్నారు.
కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్కుమార్రెడ్డి, జడ్పీటీసీ ఎర్ర రణీలాయాదగిరి, సర్పంచులు బట్ట హరిత, అల్లి సైదులు, షేక్ ఇంతియాజ్, ఎంపీటీసీ జోగు సైదమ్మ, మండలాధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, అన్నెబోయిన సుధాకర్, చాడ సురేశ్రెడ్డి, గోదల నరేందర్రెడ్డి, అశోక్రెడ్డి, నోముల జనార్దన్, భూపతి అంజయ్యగౌడ్, చింత ధనుంజయ్య, పుల్లూరి దేవేందర్, పెరుమాండ్ల నరేశ్, బొల్లికొండ గణేశ్ పాల్గొన్నారు. అనంతరం శాలిగౌరారంలో రూ.10లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే సామేల్ ప్రారంభించారు.