సంస్థాన్నారాయణపురం, డిసెంబర్ 20 : రాచకొండ ప్రాంతంలోని ఆలయాలను అభివృద్ధి చేసి టెంపుల్ సీటీగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మెట్ల బావిని మంగళవారం కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి పరిశీలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాచకొండ ప్రాంతంలోని మెట్లబావిని రూ.30 లక్షలతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామమని పేర్కొన్నారు. అంతకు ముందు మండల కేంద్రం లోని స్వయంభూ రామలింగేశ్వర స్వామి ఆలయం, లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతిగౌడ్, ఎంపీడీఓ రాములు పాల్గొన్నారు.