భూదాన్ పోచంపల్లి, మార్చి 10 : భూదాన్ పోచంపల్లి మండలంలోని పలు గ్రామాల రహదారుల నిర్మాణ పనులకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. నారాయణగిరి నుండి దేశ్ముఖి రోడ్డు, మోడల్ స్కూల్ రోడ్డు, వంక మామిడి నుండి శేరీలగూడెం రోడ్డు, అబ్దుల్లానగర్ రుద్రవెల్లి రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు పాక మల్లేశ్, పట్టణాధ్యక్షుడు భారత లవ కుమార్, జిల్లా నాయకులు కళ్లెం రాఘవరెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, సామ మధుసూదన్ రెడ్డి, కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు.