రామగిరి, ఏప్రిల్ 9 : శ్రీ క్రోధి తెలుగు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మంగళవారం ఉగాది పర్వదినాన్ని ప్రజలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఇంటి గుమ్మాలకు మామిడి, వేప తోరణాలు కట్టి నవ వసంతం మాదిరిగా తమ కుటుం బం పచ్చగా, సంతోషంగా ఉండాలని పూజలు నిర్వహించారు. ఇంటిల్లిపాది పిండి వంటలతోపాటు షడ్రుచుల ఉగాది పచ్చడిని ఆస్వాదించారు. ఆలయాల్లో అర్చకులు పంచాంగ శ్రవణం చేశారు. పలుచోట్ల జరిగిన కార్యక్రమంలో ప్రజలు పాల్గొని తమ రాశుల వివరాలను తెలుసుకున్నారు. సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి కుటుంబ సమేతంగా ఉగాది పండుగను జరుపుకొన్నారు. నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి పలువురు నాయకులు, కార్యకర్తలతో కలిసి వేడుకలు నిర్వహించారు. పలుచోట్ల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.