రామగిరి, డిసెంబర్ 24 : ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేడుకలకు అంతా సిద్ధమైంది. చర్చిలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలతోపాటు కేక్ కటింగ్ చేయనున్నారు. మరో వైపు క్రిస్టియన్లు తమ ఇండ్లపై స్టార్ లైట్లను ఏర్పాటు చేసుకోగా శాంటాక్లాజ్ వేషధారణలతో చిన్నారులు సందడి చేస్తున్నారు.
ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. విశ్వమానవాళికి తన ప్రేమతత్వంతో వెలుగులు నింపిన కరుణామయుడు ఏసుక్రీస్తు అని, ఆయన జన్మదినాన్ని సుఖసంతోషాలతో జరుపుకోవాలని కోరారు.