మాడ్గులపల్లి, డిసెంబర్ 24 : రాష్ట్ర సమాచార శాఖ మాజీ కమిషనర్, మాడ్గులపల్లి మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన కట్టా శేఖర్రెడ్డి మాతృమూర్తి జానమ్మ (95) అనారోగ్యంతో ఆదివారం మృతిచెందారు. ఆమె భౌతికకాయాన్ని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి సందర్శించి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం శేఖర్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆయన వెంట నల్లగొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నాయకులు పోకల రాజు, యల్దండ లింగారెడ్డి, వెన్న శ్రవణ్, కట్టా సిద్ధార్థ, దర్శనం రాంబాబు, నరేందర్రెడ్డి, పుల్లెంల ఏడుకొండలు ఉన్నారు. అలాగే రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శేఖర్రెడ్డికి ఫోన్ చేసి పరామర్శించారు.