నూతనకల్, అక్టోబర్ 20 : బీఆర్ఎస్ పార్టీతోనే సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం సాధ్య మవుతుందని, పార్టీ మ్యానిఫెస్టోకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని మిర్యాల గ్రామంలో గల సీతారామచంద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం మిర్యాల, లింగంపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు అనేక పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు.
ప్రసుత్తం రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తుండుగా వాటిని రూ.16 వేలకు పెంచుతున్నట్లు చెప్పారు. కల్యాణలక్ష్మి పథకం కింద రూ.2 లక్షలు, గ్యాస్ సిలిండర్ రూ.400కే ఇస్తామని సీఎం ప్రకటించినట్లు తెలిపారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతి పేద మహిళకు రూ.3 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు చెల్లిస్తామన్నారు. పేదలకు తెల్ల రేషన్ కార్డు ద్వారా దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యం అందిస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా పథకం కల్పిస్తున్నట్లు చెప్పారు. మూడోసారి తనకు ఎమ్మెల్యే అవకాశం కల్పించాలని, కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ భూరెడ్డి కళావతీసంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, సర్పంచ్ కనకటి సునీతావెంకన్న, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చూడి లింగారెడ్డి, సర్పంచులు గోరుగంటి ఉషారామకిషన్, పట్టేటి వినోదరాజు, మున్న మల్లయ్య, బత్తుల సాయిల్గౌడ్, బద్దం ప్రశాంత్రెడ్డి, జక్కి పరమేశ్, మన్నెం రమేశ్, పెద్దింటి మధు, మన్నెం సైదులు, బత్తుల విజయ్, బత్తుల సురేశ్ పాల్గొన్నారు.