అర్వపల్లి, అక్టోబర్ 10 : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని కోడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు 30మంది తిరుమలగిరి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు నచ్చి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు గుండగాని సోమేశ్గౌడ్, నిద్ర సంతు పాల్గొన్నారు.
మోత్కూరు : ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు జంగ నర్సయ్య హైదరాబాద్లోని ఎమ్మెల్యే కిశోర్కుమార్ నివాసంలో ఆయన సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన ప్రగతిని చూసి పార్టీలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో రైతు బంధు జిల్లా కమిటీ సభ్యుడు జంగ శ్రీను, శాఖ గ్రంథాలయం చైర్మన్ కోమటి మత్స్యగిరితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.