నకిరేకల్, నవంబర్ 27: 2018లోనే అయిటి పాముల ప్రాజెక్ట్ లిప్ట్ మంజూరు చేయించానని కాంగ్రెస్ అభ్యర్థి వీరేశం అసత్య ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో సోమవారం ఆయన ఎంపీ బడుగుల లింగయ్యతో కలిసి ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం కడపర్తి మెయిన్ సెంటర్లో రోడ్షోలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడారు.
వేముల వీరేశం అయిటి పాముల ప్రాజెక్ట్ మంజూరు చేసినట్లు నిరూపించ లేకపోతే ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటువా అని సవాల్ విసిరారు. తానే రూ100 కోట్లు అయిటిపాముల లిఫ్ట్ మంజూరు చేయించానని ఆ కాపీలను అంబేద్కర్ పాదాల వద్ద ఉంచు తా..నీవు మంజూరు చేయించిన కాపీలను అంబే ద్కర్ పాదాల వద్ద ఉంచుతా..అధికారుల సమక్షంలో, ప్రజాక్షేత్రంలో రావాలని సవాల్ విసిరారు.
2018లో అయిటిపాముల లిఫ్ట్ మంజూరు చేయించానని నిరూపిస్తే కడపర్తి గ్రామం నుంచి ప్రచార రథాన్ని వదిలిపెట్టి వదిలిపెట్టి ఇంటికెళ్తానని, ఓట్లు అడగను అని అన్నారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో ప్రచారాలు చేస్తూ తమ కార్యకర్తలను బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మంచి, చెడులను ఆలోచించి తనకు ఓటు వేస్తే ఐదేళ్లు కాపాడే బాధ్యత తనదేనన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్,
చింతల సోమన్న, నలగాటి ప్రసన్నరాజ్, సందినేని వెంకటేశ్వర్రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేష్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ గొర్ల సరిత వీరయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, మండల ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, పట్టణ అధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి, కౌన్సిలర్ కొండ శ్రీను, గ్రామశాఖ అధ్యక్షులు కొప్పు సోమయ్యగౌడ్, మండల ఉపాధ్యక్షులు పల్లెబోయిన ఆంజనేయులు పాల్గొన్నారు.
కట్టంగూర్: కాంగ్రెసోళు ్లప్రజలపై కపట ప్రేమ కురిపిస్తున్నారని బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ముత్యాలమ్మగూడెం జీపీ పరిధిలోని బిల్లంకానిగూడెం సోమవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మీ అందరి దీవెనలతో మళ్లీ గెలిస్తే నియోజకవర్గాన్ని అని విధాలా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.
వ్యవసాయానికి 24 కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలా.. మూడు గంటలు మాత్రమే ఇస్తామంటున్నా కాంగ్రెస్ కావాలో రైతులు ఆలోచించుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊట్కూరి ఏడుకొండలు, మాజీ సర్పంచులు పులకరం లింగస్వామి, గాదబోయిన యాదయ్య, మల్లెబోయి శ్రీను. నాయకులు అమరోజు నర్సింహ, కట్టా జానకిరెడ్డి, పులకరం కొండల్, కాడింగ్ లింగస్వామి, ఎల్క సైదులు, ఎల్క మధు పాల్గొన్నారు.
రామన్నపేట : సీఎం కేసీఆర్ ప్రభుత్వం యాసంగి పంటకు రైతు బంధు సాయం రైతులఖాతాల్లో జమ చేస్తామనుకుంటే కడుపుమంటతో కాంగ్రెసోళ్లు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి డబ్బులు వేయకుండా నిలిపి వేయించారని బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.మండలకేంద్రంతో పాటు కొమ్మాయిగూడెం, సర్నేనిగూడెం గ్రామాల్లో సోమవారం ఆయన గడపగడపకూ వెళ్లి కారు గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థ్ధించారు.
మహిళలుమంగళహారతులతో తిలకం దిద్ది స్వాగతం పలికారు కార్యక్రమంలో గుత్తా అమిత్రెడ్డి, సర్పంచులు ధర్నెరాణి మధు, ఎడ్ల మహేందర్రెడ్డి, బీఆర్ఎస్వై రాష్ట్ర ఉపాధ్యక్షుడు చైర్మన్ కడా రి స్వామి, నంద్యాల భిక్షంరెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షకార్యదర్శులు పోతరాజు సాయికుమార్, జాడ సంతోష్, ఉపసర్పంచులు పొడిశెట్టి కిషన్, బెల్లి అంజయ్య, నాయకులు బందెల రాములు పాల్గొన్నారు.