చిట్యాల, అక్టోబర్ 28 : అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్లో ధర్మానికి దౌర్జాన్యానికి మధ్య పోరు సాగుతున్నదని కావునా ధర్మాన్నే గెలిపించాలని కోరారు. శనివారం పెద్దకాపర్తిలో ఇంటింటి ప్రచారం చేపట్టి, చిట్యాలలో భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. కానీ తాను నియోజకవర్గంలోని ప్రతి పల్లెను అభివృద్ధి వైపే తీసుకెళ్లినట్లు చెప్పారు. ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా, నిరంతరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు వివరించారు.
మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా నియోజక వర్గానికి ఎన్నో నిధులు తీసుకువచ్చినట్లు, ఒక్క చిట్యాలలోనే దాదాపు రూ.38 కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. నియోజక వర్గానికి సాగు నీరందించే ఉదయ సముద్రం, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలను పూర్తి చేయించినట్లు వెల్లడించారు. కాగా ఇదే ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆ వ్యక్తి ఐదేండ్లలో ఏమి అభివృద్ధి చేశాడని మళ్లీ పోటీ చేస్తున్నట్లు విమర్శించారు. అలాంటి వ్యక్తికి ఓటర్లే తగిన బుద్ధి చెప్పాలని కోరారు. నియోజక వర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బలమైన నాయకత్వం ఉన్నదని గుత్తా సుఖేందర్రెడ్డి, బండ నరేందర్రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, కంచర్ల భూపాల్రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి వంటి నాయకులు ఈ నియోజక వర్గానికి చెందిన వారేనని.. వారందరి మద్దతుతో సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో పోటీ చేస్తున్న తనను మరోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
రాష్ర్టాన్ని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి గత చరిత్ర సరైనది కాదని ఆ విషయం నియోజక వర్గం ప్రజలందరికీ తెలుసునని పేర్కొంటూ చిట్యాల ఎంపీపీ ఎన్నిక, బొడ్డుపల్లి శ్రీను హత్యల విషయాలను ప్రస్తావించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి ఆ పథకాలన్నీ ఇంకా మెరుగ్గా కొనసాగేందుకు మరోసారి బీఆర్ఎస్నే గెలిపించాలని కోరారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుత్తా అమిత్రెడ్డి మాట్లాడుతూ.. సౌమ్యుడు, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజక వర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేసే చిరుమర్తి లింగయ్యనే గెలపించాలని కోరారు. కార్యక్రమాలలో చెరుకు సుధాకర్, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, కొలను వెంకటేశ్, సుంకరి యాదగిరి, ఆవుల అయిలయ్య, కల్లూరి మల్లారెడ్డి, మెండె సైదులు, గుండెబోయిన సైదులు, పొన్నం లక్ష్మయ్య, జిట్ట చంద్రకాంత్, దాసరి నర్సింహ, బెల్లి సత్తయ్య, కొనేటి కృష్ణ, గోధుమగడ్డ పద్మాజలంధర్రెడ్డి, జమాండ్ల శ్రీనివాస్రెడ్డి, చిత్రగంటి ప్రవీణ్ పాల్గొన్నారు.
పెద్దకాపర్తిలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే చిరుమర్తి ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి అందుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ తనను మరోమారు గెలిపించాలని కోరారు. గ్రామంలోని అన్ని వీధుల్లో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ను గెలిపిస్తే కలిగే, జరిగే నష్టాలను వివరించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. మహిళలు ఎమ్మెల్యేకు మంగళ హారతులు పట్టి, విజయ తిలకం దిద్ది ఆశీర్వదించారు. కార్యక్రమంలో సర్పంచ్ మర్రి జలంధర్రెడ్డి, ఎంపీటీసీ ముద్దసాని నీతా, సింగిల్ విండో చైర్మన్ రుద్రవరపు భిక్షపతి, బాలగోని రాజు, రాచకొండ కిష్టయ్య, పొట్లపల్లి చిన్నస్వామి, మురళి, ఆవుల జానయ్య, గణేశ్ పాల్గొన్నారు.
మండలంలోని పెద్దకాపర్తిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు సర్పంచు మర్రి జలంధర్రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కుర్ర సత్తయ్య, గుండెబోయిన చంద్రం, కాటం మహేశ్, కాటం శివశంకర్ ఉన్నారు. కార్యక్రమంలో ముద్దసాని నీతారమణారెడ్డి, చింతకింది తిరుమలయ్య, పొట్లపల్లి చిన్నస్వామి, బత్తుల శ్రీరంగం, బాగలోని రాజు, ఆవుల జానయ్య, ఎదుల్ల రాంరెడ్డి పాల్గొన్నారు.
రామన్నపేట : ప్రజలే నా బలం నా బలగం అని.. మీరు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని దుబ్బాక, మునిపంపుల, పల్లివాడ గ్రామాల్లో గడపగడపకూ వెళ్లి బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో రూ.కోటికి పైగా అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. కాంగ్రెస్కు ఓటేస్తే కారు చీకట్లే అన్నారు. ఇప్పటికే రైతు బంధు ఆపాలని, రైతులకు 3 గంటలే కరెంట్ ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్ నాయకులకు ఓటు అనే ఆయుధంతో బలమైన సమాధానం ఇవ్వాలన్నారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని గత నాలుగేండ్ల కాలంలో జరిగిన పనులను బేరీజు వేసుకోవాలన్నారు.
మీ కుంటుంబ సభ్యుడిగా కష్ట సుఖాల్లో ముందుటానని తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరామ్, మందడి ప్రభాకర్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పోశబోయిన మల్లేశం, సర్పంచులు నీల జయలక్ష్మీదయాకర్, మెట్టు మహేందర్రెడ్డి, ఎంపీటీసీలు గాదే పారిజాత, దోమల సతీశ్, మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమారమేశ్, బందెల రాములు, బొక్క పురుషోత్తంరెడ్డి, సాల్వేరు అశోక్, పోతరాజు సాయికుమార్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుండాల రాంబాబు, నీల చెన్నకేశవులు, తోట వెంకన్న, మామిండ్ల అశోక్, క్యాస వీరస్వామి, జడల శాంతికుమార్, నక్క శంకరయ్య, మామిండ్ల కుమార్, కూనూరు రవి, మామిడి పద్మారెడ్డి, జమాలుద్దీన్, కర్రె శ్రీను, గడ్డం స్వామి, నాగరాజు పాల్గొన్నారు.