బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనతో సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ పేర్లు వెల్లడించిన వెంటనే ఎక్కడికక్కడే బీఆర్ఎస్ శ్రేణులు వీధుల్లోకి వచ్చారు. స్వీట్లు పంచి, పటాకులు కాల్చారు. ర్యాలీలు తీశారు. జై కేసీఆర్… జై బీఆర్ఎస్… నినాదాలు హోరెత్తించారు. ప్రస్తుత ఎమ్మెల్యేనే మరోసారి అభ్యర్థి కానుండడంతో రెట్టించిన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఇదే జోష్తో కదన రంగానికి సిద్ధమవుతామని సంకేతాలిచ్చారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి, మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్, కోదాడలో ఎమ్మెల్యేలు భాస్కర్రావు, భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మల్లయ్యయాదవ్ పాల్గొన్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి నుంచి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
– నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 21(నమస్తే తెలంగాణ)
దేవరకొండ, ఆగస్టు 21 : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకొండ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ను సీఎం కేసీఆర్ ప్రకటించడంతో సోమవారం బీఆర్ఎస్ శ్రేణులు నియోజకవర్గ కేంద్రంలో సంబురాలు జరుపుకొన్నారు. స్థానిక బస్టాండ్ నుంచి మీనాక్షి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నాలుగోసారి కూడా దేవరకొండ ఖిలాపై గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా రవీంద్రకుమార్ను గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇస్తామని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్, నాయకులు వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, పొట్ట మధు, చిత్రం ఏసోబు, రఘు, చిత్రం ప్రదీప్ పాల్గొన్నారు.
మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లమోతు భాస్కర్రావును పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించడంపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం సంబురాలు జరుపుకొన్నాయి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మిర్యాలగూడ ఎమ్మెల్యేగా నల్లమోతు భాస్కర్రావు భారీ మెజార్టీతో మూడోసారి గెలుపొందడం ఖాయమన్నారు. ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, నాయకులు నామిరెడ్డి కరుణాకర్రెడ్డి, పెద్ది శ్రీనివాస్గౌడ్, మట్టపల్లి సైదులు, ధనావత్ చిట్టిబాబునాయక్, అమరావతి సైదులు, జొన్నలగడ్డ రంగారెడ్డి, భిక్షంగౌడ్ ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
హాలియా : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజక వర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్కుమార్ను సీఎం కేసీఆర్ ప్రకటించడంతో నియోజవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. మండల, మున్సిపల్ కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. తమ అభిమాన నాయకుడికి మళ్లీ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, పెద్దవూర అబ్బిడి కృష్ణారెడ్డి, గుర్రంపోడు ఎంపీపీ మంచుకంటి వెంకటేశ్వర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు జవ్వాజి వెంకటేశ్వర్లు, మర్ల చంద్రారెడ్డి, నందికొండ మున్సిపల్ చైర్పర్సన్ కర్ణ అనూషాశరత్రెడ్డి, ఆవులదోడ్డి రాహుల్ యాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, బహునూతల నరేందర్, రవినాయక్, గజ్జల చెన్నారెడ్డి, నాయకులు చెరుపల్లి ముత్యాలు, వజ్జ రామేశ్వరీ ధనుంజయ్, కామర్ల జానయ్య, ఆడెపు రామలింగయ్య, గజ్జల లింగారెడ్డి, సుంకిరెడ్డి వెంకట్రెడ్డి, కర ్ణబ్రహ్మానందరెడ్డి, వాసుదేవుల సత్యనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ ఆవుల వెంకన్నయాదవ్, ఎన్నమల్ల సత్యం, చేగొండి కృష్ణ, దోరేపల్లి వెంకటేశ్వర్లు, షేక్ బషీర్, వెంకటాచారి, అనుముల శ్రీనివాస్రెడ్డి, సురభి రాంబాబు, బాబొద్దీన్, మంద రఘువీర్, బత్తుల సత్యనారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నల్లగొండ : బీఆర్ఎస్ నుంచి నల్లగొండ అసెంబ్లీ స్థానానికి స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డికి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించటంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివెరిసింది. సోమవారం మధ్యాహ్నం క్లాక్ టవర్ సెంటర్లో గులాబీ శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో నల్లగొండను ఎంతో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే భూపాల్రెడ్డిని విశ్వసించి మరోసారి అధిష్టానం టికెట్ కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. మరోసారి నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి విజయం ఖాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, జమాల్ ఖాద్రి, ఇబ్రహీం, పార్టీ మండలాధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, బకరం వెంకన్న, రావుల శ్రీనివాస్రెడ్డి, పార్టీ మహిళా అధ్యక్షురాలు మాలె శరణ్యారెడ్డి, దుబ్బ రూప, యాట జయప్రదరెడ్డి, కొండ్ర స్వరూప, సందినేని జనార్ధన్రావు, మైనం శ్రీను, పాలకూరి యాదయ్య, జెర్రిపోతుల భాస్కర్, ఆలకుంట్ల మోహన్ బాబు పాల్గొన్నారు. నల్లగొండలోని వీటీ కాలనీలో ఎమ్మెల్యే నివాసానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు, ఆయా సంఘాల వారు వేర్వేరుగా కలిసి బొకేలు అందించారు.