నకిరేకల్, ఆగస్టు 3 : రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గత ఎన్నికల వాగ్దానం మేరకు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని 45 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం పట్ల హర్షం వ్యక్తం గురువారం జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. నకిరేకల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రైతులతో కలిసి సంబురాలు జరుపుకున్నారు. పటాకులు పేల్చి, మిఠాయి పంపిణీ చేశారు. ముందుగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, జగదీశ్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ రుణాలు మాఫీ చేసినందుకు నియోజకవర్గ రైతుల తరపున సీఎం కేసీఆర్కు పాదాభివందనాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కక్ష పూరిత చర్యల వల్ల రుణమాఫీ కొంత మేరకు ఆలస్యం జరిగిన మాట వాస్తమని, రైతు సంక్షే మం, వ్యవసాయరంగ అభివృద్ధి కోసం సీఎం కేసిఆర్ ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొంటారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, బొప్పని స్వర్ణలత, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పల్రెడ్డి మహేందర్రెడ్డి, బీఆర్టీయూ రాష్ట్ర మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు సిల్వేరు ప్రభాకర్, నకిరేకల్, కేతేపల్లి బీఆర్ఎస్ మండలాధ్యక్షులు ప్రగడపు నవీన్రావు, మారం వెంకట్రెడ్డి, పట్టణాధ్యక్షుడు సైదిరెడ్డి, నాయకులు పెండెం సదానందం, సోమయాదగిరి, మురారిశెట్టి కృష్ణమూర్తి, మాద నగేశ్గౌడ్, దైద పరమేశం, గుర్రం గణేశ్, గొర్ల వీరయ్య, కౌన్సిలర్లు, సర్పంచులు,ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నల్లగొండ : నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకొని సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి సీఎం కేసీఆర్ రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న పథకాలపై నినదించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతిగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో పథకాలు అమలు చేస్తూ రైతు బాంధవుడిగా వారి గుండెల్లో నిలిచి పోయినట్లు తెలిపారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, ఆలకుంట్ల నాగరత్నం రాజు, కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, జమాల్ ఖాద్రి, జాన్ శాస్త్రి, మైనం శ్రీనివాస్, లొడంగి గోవర్దన్, సందినేని జనార్దన్ రావు, బీఆర్ఎస్ తిప్పర్తి, కనగల్ మండలాధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, అయితగోని యాదయ్య, తిప్పర్తి మండల మహిళా అధ్యక్షురాలు కొండ్ర స్వరూప, పట్టణ ఉపాధ్యక్షురాలు యాట జయప్రదారెడ్డి, గాలి రాధిక, కంచర్ల విజయ పాల్గొన్నారు.
కట్టంగూర్: కట్టంగూర్ రైతువేదిక, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద వేర్వేరుగా ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ క్షీరాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చైర్మన్ నూక సైదులు మాట్లాడుతూ రైతులు కేసీఆర్కు అండగా ఉంటూ మూడో సారి సీఎంను చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడేఊట్కూరి ఏడుకొండలు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, వైస్ చైర్మన్ కుందారపు వెంకట్రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ గుండగోని రాములు, బాస్కర్లబాయి సర్ప ంచ్ చినపాక పరశురాములు, కురుమర్తి సర్పంచ్ గుర్రం సైదులు, పీఏసీఎస్ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నార్కట్పల్లి: మండలకేంద్రంలోని రైతు వేదికలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, రైతు బంధు సమితి మం డల కన్వీనర్ యానాల అశోక్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.
చిట్యాల: చిట్యాల రైతువేదిక వద్ద మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి రైతులతో కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సీఎం కేసీఆర్కు అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొన్నం లక్ష్మయ్య, జిట్ట చంద్రకాంత్, రైతులు బొబ్బిలి భిక్షంరెడ్డి, దాసరి లచ్చయ్య, నూనె శంకరయ్య, రెముడాల గట్టయ్య, నాయకులు గుండబోయిన సైదులు, బెల్లి సత్తయ్య, కోనేటి కృష్ణ, దాసరి నర్సింహ పాల్గొన్నారు. అలాగే మండలంలోని వెలిమినేడు రైతువేదిక వద్ద ప్రజాప్రతినిధిలు, రైతులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి అధ్యక్షుడు దేవిరెడ్డి సుధాకర్రెడ్డి, పిశాటి రాంమ్రెడ్డి, ఆరూరి ధనుంజయ్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఆరూరి శ్రీశైలం, మార్కెట్ డైరెక్టర్ చింతకింది వెంకటేశ్, బైకాని నర్సింహ, నాతి శ్రీనివాస్, ఫైళ్ల రఘుమారెడ్డి, బొంతల రామకృష్ణారెడ్డిపాల్గొన్నారు.
శాలిగౌరారం: మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కం దుల అనిత, రాష్ట్ర నాయకుడు మామిడి సర్వయ్య, కట్టా వెంకట్ రెడ్డి, గుజిలాల్ శేఖర్బాబు, గంట శంకర్, కొన్రెడ్డి వేణుగోపాల్రెడ్డి, చామ లమహేందర్రెడ్డి, నూకసత్తయ్యయాదవ్, మామిడి రమేశ్, చిర్ర బోయిన శ్రీనివాస్, బట్ట వీరబాబు, సురేశ్గౌడ్ పాల్గొన్నారు. అలాగే శాలిగౌరారం గ్రామ పంచాయతీ పరిధిలోని పావురాలగూడెంలో నాటు వేస్తున్న రైతులు, కూలీలు పొలంలోనే సీఎం కేసీఆర్ ప్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
కనగల్ : మండలకేంద్రంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కరీంపాషా, జడ్పీటీసీ చిట్ల వెంకటేశంగౌడ్, వైస్ ఎంపీపీ రామగిరి శ్రీధర్రావు, రైతు సంఘం మండలాధ్యక్షుడు ఎర్ర బెల్లి నర్సిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, మర్రి రేణుక సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : మండలంలోని పానగల్ రైతు వేదిక వద్ద సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి గొల్లగూడ పీఏసీఏస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఏస్ సీనియర్ నాయకులు బకరం వెంకన్న, గాదెరాంరెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బడుపుల శంకర్, తవిట కృష్ణ, సుంకు ధనలక్ష్మి, జంగయ్య, పెద్ది వెంకటయ్య, ఎలుక శ్రీనివాస్రెడ్డి, సహాదేవ్, కోట్ల జయపాల్రెడ్డి, జలంధర్రెడ్డి, రమేశ్ , విజయ్ ,భిక్షం, మురళి పాల్గొన్నారు.
తిప్పర్తి: మండలకేంద్రంలో సహకార బ్యాంకు ఎదుట సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి, రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ముత్తినేని శ్యాంసుందర్, సహకార బ్యాంకు వైస్ చైర్మన్ కందుల రేణుక, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పల్రెడ్డి రవీందర్రెడ్డి, ప్రధానకార్యదర్శి వనపర్తి నాగేశ్వర్రావు, నాయకుల నలపరాజు శ్రీనివాస్, జాకటి మోష, కరీం, దాసరి రవీందర్ పాల్గొన్నారు.
మునుగోడు : మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద గురవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.అనంతరం పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలోఎంపీపీకర్నాటి స్వామియాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి ,ఎంపీటీసీలు, సర్పంచులు, రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
మర్రిగూడ : మండల కేంద్రంలోని చౌరస్తా, శివన్నగూడెం సొసైటీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, సర్పంచ్ నల్ల యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ బచ్చు రామకృష్ణ, సహకార చైర్మన్ బాలం నర్సింహ, దళితబంధు డైరెక్టర్ లపంగి నర్సింహ, సీనియర్ నాయకులు రామిడి వెంకటరమణారెడ్డి, పందుల రాములు, కొల్కులపల్లి యాదయ్య, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోటకూరి శంకర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఐతగోని వెంకటయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు మారగోని వెంకటయ్య యాదవ్, నాయకులు గోపీనాయక్, నాగరాజు,ఆకారపు శ్రీను, రఘు, వెంకటేశ్, భిక్షం, నాయకులు పాల్గొన్నారు.
నాంపల్లి: మండల కేంద్రలో అబేంద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుమ్మడపు నర్సింహారావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, పోగుల వెంకట్రెడ్డి, కడారి శ్రీశైలం యాదవ్, సపావత్ సర్దార్ నాయక్ పాల్గొన్నారు.
చండూరు : మండలకేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం వద్ద సంఘం చైర్పర్సన్ కోడి సుష్మ ఆధ్వర్యంలో స్థానిక రైతులతో కలిసి సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మిఠాయిలు పంపిణి చేశారు. కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మన్ గుండమల్ల శ్రీనివాసులు, కౌన్సిలర్లు తోకల వెంకన్న, కోడి వెంకన్న ,పాటల వెంకన్న, భూతరాజు దశరథ, నల్ల లిం గయ్య ,నందికొండ నర్సిరెడ్డి ,చొప్పరి వెంకన్న, నాగిల్ల వెంకటయ్య, నారపాక శంకర్, బొడ్డు సతీశ్ పాల్గొన్నారు.