నల్లగొండ : కరోనా మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆసరా అయ్యారు. ఆదివారం నకిరేకల్ పట్టణంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శి అధైర్య పడవద్దు అండగా ఉంటానని అభయమిచ్చారు. నకిరేకల్ పట్టణములో 1,2,5,6,17, 20 వ వార్డుల్లో కరోనా బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలను, హోమ్ ఐసొలెషన్లో చికిత్స పొందుతున్న కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. పదిహేను కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందజేశారు.