ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ చాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ బీఎల్ఆర్తో ప్రమాణం చేయించారు.
మాతృవియోగం కారణంగా బీఎల్ఆర్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట ఆయన సతీమణి బత్తుల మాధవి, కౌన్సిలర్ మహమ్మద్ జానీ ఉన్నారు.