విద్యార్థినిని అభినందించి సర్టిఫికెట్ అందజేసిన మంత్రి కేటీఆర్
రామగిరి, జూలై 20 : నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ)లో ఎంపీసీఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మామిడి ప్రసన్న టాస్క్-గూగుల్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్) స్కాలర్షిప్కు ఎంపికైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ఆన్లైన్లో నిర్వహించిన ఎంట్రెన్స్లో ప్రసన్న ప్రతిభ కనబర్చి స్కాలర్షిప్కు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన్శ్యాం వెల్లడించారు.
బుధవారం హైదరాబాద్లోని టీహబ్ 2.0లో నిర్వహించిన కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విద్యార్థినిని అభినందించి స్కాలర్షిప్కు సంబంధించిన సర్టిఫికెట్ అందజేశారు. విద్యార్థిని ప్రసన్నను కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు.