బొడ్రాయిబజార్, మే 6 : సూర్యాపేట మున్సిపాల్టీ యంత్రాంగం ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్తో తయారు చేయిస్తున్న ఆక్యూప్రెషర్ మ్యాట్, టైల్స్, ఇటుకలు ప్రశంసలు అందుకుంటున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి ఐసీఐసీఐ టవర్స్లో ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి సదస్సులో ఆయా ఉత్పత్తుల ప్రదర్శనను శుక్రవారం మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సందర్శించి అభినందించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొత్త ఆవిష్కరణలను ఆయన పరిశీలించారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, కమిషనర్ పి.రామాంజులరెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆక్యూప్రెషర్ మ్యాట్కు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, శివప్రసాద్ పాల్గొన్నారు.