సూర్యాపేట, ఏప్రిల్ 22(నమస్తేతెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 25న సూర్యాపేట నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. శనివారం సూర్యాపేటలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తో కలిసి బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ ఏర్పాట్లపై రూట్ మ్యాప్ రూపొందించారు. అలాగే ఏర్పాట్లను పరిశీలించేందుకు ప్రత్యేకంగా పరిశీలకులను నియమించారు.