సూర్యాపేట రూరల్, డిసెంబర్ 23 : జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పట్టణ పరిధిలోని కుసుమవారిగూడెం గ్రామానికి చెందిన దివ్యాంగ రైతు పౌల్ట్రీఫామ్ రంగంలో రాణిస్తున్న బత్తిని శంకర్ను రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శంకర్ నిర్వహిస్తున్న పౌల్ట్రీఫామ్ను మంత్రి పరిశీలించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, జడ్పీటీసీ జీడి భిక్షం, కేవీకే రైతుమిత్ర ఫౌండర్ ఉపేందర్రెడ్డి పాల్గొన్నారు.