నల్లగొండ : జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. బుధవారం మర్రిగూడ, మునుగోడు నాంపల్లి, చండూరువిస్తృతంగా పర్యటించారు. మర్రిగూడ మండలం ఖుదాభక్షపల్లి గ్రామంలో లబ్ధిదారులకు కల్యాణాలక్షి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
కాగా, మంత్రికి ఖుదాభక్షపల్లి గ్రామంలో నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్థానక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.